వివేకా హ‌త్య కేసుపై సునీత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ నేత‌ వివేకానంద రెడ్డి హ‌త్య కేసుపై ఆయ‌న కుమార్తె సునీతా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న తండ్రి హ‌త్య కేసులో సాక్ష్యులుగా ఉన్న వ‌రుస‌గా అనుమానాస్ప‌దంగా చ‌నిపోతున్నార‌ని ఆరోపించారు. నేడు వివేకానంద వ‌ర్ధంతి సంద‌ర్భంగా పులివెందుల‌లో ఆయ‌న‌కు సునీత నివాళి అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.. త‌న తండ్రి హ‌త్య జ‌రిగి ఆరేళ్ల‌వుతున్నా నేటికీ న్యాయం జ‌ర‌గ‌లేద‌న్నారు. సీబీఐ ఈ కేసును మ‌ళ్లీ ముందుకు తీసుకెళ్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. సాక్ష్యుల్లో ఒక్క‌రు మిన‌హాయించి, మిగ‌తా వారంతా బ‌య‌ట స్వేచ్ఛ‌గా తిరుగుతున్నార‌న్నారు. నిందితులు సాక్ష్యుల‌ను బెదిరిస్తున్నార‌ని, వాంగ్మూలాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని బెదిరిస్తున్నార‌ని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *