వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మద్యం అమ్మకాలపై సీఐడీ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ సీఐడీ ఆయనను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ వెళ్లింది. ఏ క్షణంలోనైనా మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారని అంతా భావిస్తున్న తరుణంలో ఆయన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఏపీ సీఐడీని ధర్మాసనం ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.