గ్రూప్ 1 ప‌రీక్ష‌లు య‌థావిధిగా నిర్వ‌హించాల‌న్న సుప్రీం కోర్టు

గ్రూప్ 1 ప‌రీక్ష‌ల‌ను య‌థావిధిగా నిర్వ‌హించాల‌ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌న్న గ్రూప్ వ‌న్ అభ్య‌ర్థుల డిమాండ్‌ను కోర్లు తోసిపుచ్చింది. నేటి నుంచి గ్రూప్‌ 1 పరీక్షలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. అభ్యర్థుల తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం స్పందిస్తూ.. ఇంత వరకు వచ్చి ఇప్పుడు ప‌రీక్ష‌లు వాయిదా వేయడం మంచిది కాదని తెలిపింది. ఇందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ప‌రీక్ష‌లు వాయిదా వేయ‌డం వ‌ల్ల ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అయిన అభ్య‌ర్థుల క‌ష్టం వృథా అవుతుంద‌ని తెలిపింది. నేటి నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని కోర్టు తెలిపింది. దీంతో అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద భారీగా చేరుకొని పరీక్ష రాసేందుకు సిద్దమయ్యారు. అభ్య‌ర్థుల ఆందోళ‌నల నేప‌థ్యంలో ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద పోలీసులు భారీ ఎత్తున చేరుకొని భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *