వికారాబాద్ జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. హాస్టల్లో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాయ్స్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి గురువారం తెల్లవారుజామున విగతజీవిగా కనిపించాడు. బుధవారం రాత్రి నిద్రపోయి ఉదయం లేవకపోవడంతో హాస్టల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి విద్యార్థి మృతి చెందినట్టు నిర్ధరించారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియరాలేదు. విద్యార్థి మృతికి నిరసనగా తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అధికారులు హాస్టల్కు వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు.