తెలంగాణలో ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి మారిన ఎమ్మెల్యేలకు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. సోమవారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే నోటీసులు జారీ చేసినట్లు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు. స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయని, అయితే తమకు వివరణ ఇచ్చుకునేందుకు కొంత సమయం కావాలని, న్యాయ నిపుణులను సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటామని పలువురు ఎమ్మెల్యేలు వెల్లడించారు.