తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్తారని విశ్వసనీయ సమాచారం. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణపై ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ మంతనాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు సైతం దీనిపై చర్చ జరిగినట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు దాటినా నేటికీ కొన్ని కేబినేట్ పదవులు ఉన్నాయి. సీఎం ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా దీనిపైనే చర్చించనున్నట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో పలు జిల్లాలకు మంత్రులు లేరు. మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేబినేట్ విస్తరణ వేగవంతంగా చేపట్టాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.