తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు భద్రచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆలయానికి చేరుకున్న గవర్నర్ కు ఆలయ ఈవో రమాదేవి, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రధానాలయంలో దర్శనానంతరం, గవర్నర్ ఆంజనేయస్వామి, లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకున్నారు.అర్చకులు గవర్నర్కు ఆశీర్వచనం అంచగా, ఆలయ ఈవో స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.