నేడు మౌనీ అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్కు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. బుధవారం రోజు సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సీఎం యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. ప్రజలు ప్రశాంతంగా పవిత్ర స్నానాలు ఆచరించాలని, త్రివేణి సంగమం వైపు వెళ్లవద్దని సూచించారు. పోలీసుల సూచనలు , సలహాలు పాటించాలని చెప్పారు. మౌనీ అమావాస్య, రాత్రి జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారు జామున పుణ్య స్నానాలు ఆచరించాల్సిన సాధువులు, అకాడాలు, సన్యాసులు కాస్త ఆలస్యంగా అమృత స్నానం ఆచరించేందుకు సంగమం వద్దకు వచ్చారు.