సినీ నటులు సమంత, నాగచైతన్యల విడాకులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సినీ నటుడు నాగార్జున సైతం నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు నేడు కోర్టులో విచారణకు వచ్చింది. ఈ క్రమంలో మంత్రిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ పరువు నష్టం కేసులో మంత్రిపై కోర్టు ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి అని చర్చించుకుంటున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తాయని పేర్కొన్న కోర్టుల ఆ వ్యాఖ్యలను అన్ని సోషల్ మీడియా వేదికలు, టీవీ చానెళ్ల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.