న‌గ‌రంలో మ‌రోసారి డ్ర‌గ్స్ క‌ల‌క‌లం

తెలంగాణ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ వినియోగంపై ఉక్కు పాదం మోపుతోంది. అయిన‌ప్ప‌టికీ ప‌లు చోట్ల అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతోంది. న‌గ‌రంలో వారాంతాల్లో ప‌లు ప‌బ్బుల్లో డ‌గ్ర్ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా మ‌రోసారి డ్ర‌గ్స్ పెద్ద‌మొత్తంలో ప‌ట్టుబ‌డ్డాయి.హైద‌రాబాద్‌లోని హుమాయున్‌గర్‌లో పోలీసులు దాడులు నిర్వ‌హించి డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఓ ముఠాను అరెస్టు చేశారు. నిందితుల వ‌ద్ద‌ 50 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. ఓ విదేశీయుడితో పాటు న‌గ‌రానికి చెందిన ముగ్గురు డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. బాచుపల్లి పోలీస్ స్టేష‌న్‌ పరిధిలోని టకీలా పబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. పబ్‌లో అనుమ‌తులు లేకుండానే కార్పొరేట్‌ ఈవెంట్లు నిర్వహిస్తున్నార‌ని గుర్తించి మ్యూజిక్‌ పరికరాలు, రెండు ల్యాప్‌టాప్‌లను సీజ్‌ చేశారు. పబ్‌ యజమానులపై కేసు నమోదు చేశారు. ఎవ‌రైనా నిషేధిత‌ డ్ర‌గ్స్ వినియోగించినా, అక్ర‌మ ర‌వాణా చేసినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *