తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు నోటీసులు అందాయి. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని మరో పిటిషన్ దాఖలైంది. ఫిబ్రవరి 10న రెండు పిటిషన్లను కలిపి విచారణ చేస్తామని ప్రకటిస్తూ కోర్టు విచారణ వాయిదా వేసింది.