తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు రాష్ట్ర కేబినేట్ కమిటీ ఆమోదం తెలిపింది. నేడు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన కేబినేట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామన్నారు. చాలా పకడ్బందీగా సర్వే చేపట్టినట్లు తెలిపారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో చేపట్టిన కుల గణనతో ప్రధాని మోడీపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో కూడా కుల గణన పై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. దీంతో బీసీ,ఎస్సీ,ఎస్టీలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.