హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఎగ్జిబిషన్ మొదలైపోయింది. జనవరి మూడు నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. రోజూ వేలాది మంది ఈ ఎగ్జిబిషన్కు హాజరవుతారు. ఈ క్రమంలో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 4 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్వర్వులు జారీ చేశారు. ఎగ్జిబిషన్ సందర్భంగా మెట్రో రైలు సేవలు పొడిగించినట్లు వెల్లడించారు. సాధారణ రోజుల్లో 11.30 గంటల వరకు, వారాంతపు రోజుల్లో రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. ఎగ్జిబిషన్ సందర్భంగా పలు ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు చేపడుతున్నామని, ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.