తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేసే కౌంటర్ల వద్ద డీఎస్పీ తప్పింద వల్లే తొక్కిసలాట జరిగిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. డీఎస్పీ నిర్లక్ష్యంగా గేట్లు తెరవడంతోనే ఇంతటి దారుణం జరిగిందన్నారు. ఒక సెంటర్లో మహిళా భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీశారని, దీంతో భక్తులు ఒక్కసారిగా ప్రవేశించడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు వివరించారు.ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడ్డ వారిని రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని సీఎం చంద్రబాబు పరామర్శిస్తారని తెలిపారు.