యాదాద్రిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

పండుగ వేళ యాదాద్రిలో జ‌రిగిన ఓ రోడ్డు ప్ర‌మాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. లారీ కారును ఢీకొన్న ఈ ఘ‌ట‌న‌లో ఓ మ‌హిళ మ‌రో చిన్నారి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. భువనగిరి మున్సిపాలిటీ రాయగిరి సమీపంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని ఓ కారు వెన‌క నుంచి వేగంగా వ‌చ్చి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ, చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల‌ను మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన వారిగా గుర్తించారు. లారీ పెట్రోల్ బంక్‌లోకి వెళ్తుండ‌గా కారు అతివేగంగా ఢీకొట్టిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని వివ‌రాలు తెలుసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *