ఇటీవల పలు కేసుల నేపథ్యంలో అరెస్ట్ అయ్యిన వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. టీడీపీ ఆఫీస్ పై దాడి, కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన కేసుల నేపథ్యంలో హైదరాబాద్లోని మై హోం భుజాలో ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. వాదనల అనంతరం వంశీతో పాటు అతడి అనుచరులకు 14 రోజుల రిమాండ్ విధించి విజయవాడ జైలుకు తరలించారు.