హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ వీఆర్ఏల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలను మంత్రివర్గ భేటీలో చర్చించాలని డిమాండ్ చేశారు. రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు నిరసనకారుల్ని అరెస్ట్ చేసి వాహనాల్లో తరలించారు. ఈ క్రమంలో పలువురు పాదచారులు, సామాన్య ప్రజలపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.