సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పోసాని భార్య కుసుమలతకు ఫోన్ చేసి పరామర్శించారు. పోసాని అరెస్టును ఖండిస్తున్నామని, వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోసాని జైలు నుంచి విడుదల అయ్యేందుకు న్యాయపరంగా సహాయం చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తోందని, అక్రమ అరెస్టులు చేసి తమ పార్టీ నాయకులను భయపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు రాష్ట్రంలో జరిగేవన్నీ గమనిస్తూనే ఉన్నారని తెలిపారు.