వైసీపీ అధినేత వైయస్ జగన్ నేడు పులివెందులలో పర్యటించనున్నారు. మరికొద్ది సేపట్లో జగన్ ప్రత్యేక హెలీకాఫ్టర్లో గన్నవరం ఎయిర్పోర్టు నుంచి పులివెందులకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన నివాసానికి చేరుకొని ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. పార్టీ నేతలతో సమావేశమై పలు విషయాలపై చర్చించనున్నారు. బుధవారం ఉదయం జగన్ వైయస్ఆర్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఆధునీకరించిన వైయస్ రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభిస్తారు. అనంతరం ఆయన ప్రత్యేక హెలీకాఫ్టర్లో బెంగళూరు వెళ్లనున్నారు.