వైసీపీ అధినేత వైయస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం సౌత్ బైపాస్ వద్దకు చేరుకున్న జగన్కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి జగన్ ర్యాలీగా గుంటూర్ మిర్చి యార్డుకు బయలుదేరారు. మిర్చి రైతులతో జగన్ మాట్లాడనున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. కొద్ది రోజులుగా మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన చెందుతున్నారు. ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో జగన్ వారిని కలిసి మద్దతు తెలపనున్నారు.