వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ నేడు విజయనగరంలో పర్యటించారు. గుర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఇటీవల డయేరియాతో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు.