పులివెందుల‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా ద‌ర్బార్

వైసీపీ అధినేత , ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క్రిస్మస్ వేడుకల కోసం పులివెందులకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. నేడు పులివెందుల‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప‌లు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయ‌న‌ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వైయ‌స్ జగన్, కడప ఎంపీ వైయ‌స్ అవినాష్‌ రెడ్డి క్యాంపు కార్యాలయానికి హాజ‌ర‌య్యారు. రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చారు. అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ ప్రజల నుంచి ప‌లు వినతి పత్రాలు స్వీక‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *