ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ముందుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభించారు. తమ ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి హాజరైన వైసీపీ అధినేత వైయస్ జగన్ తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ పోడియం ముందు నిలబడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజా వ్యవస్థలను గాడిపెడుతోందని చెప్పారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే వైసీపీ సభ్యులు సభను వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు.