వంశీని అన‌వ‌స‌రంగా కేసులో ఇరికించారు – వైయ‌స్ జ‌గ‌న్

వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీని పోలీసులు అన‌వ‌స‌ర‌పు కేసులో ఇరికించి అరెస్ట్ చేశార‌ని వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. ఓ కిడ్నాప్ కేసు నేప‌థ్యంలో ఇటీవ‌ల అరెస్ట్ అయ్యి విజ‌య‌వాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీని మాజీ వైయ‌స్‌ జగన్ ప‌రామ‌ర్శించారు. అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ మీడియాతో మాట్లాడారు… వంశీని దారుణంగా అరెస్ట్ చేశార‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం అనేదే లేకుండా పోయింద‌న్నారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని ద‌ళిత యువ‌కుడు స‌త్య‌వ‌ర్ద‌న్‌తో కేసు పెట్టించార‌న్నారు. స‌త్య‌వ ర్ద‌న్ కూడా ఈ కేసుతో తనకు, వంశీకి ఎలాంటి సంబంధం లేదని జడ్జి ముందే చెప్పాడ‌న్నారు. టీడీపీ ఆఫీసులో సీఎం చంద్ర‌బాబు పట్టాభితో బూతులు తిట్టించాడ‌ని, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చగొట్టేలా మాట్లాడించార‌ని చెప్పారు.పోలీసులు కావాలనే వంశీని అరెస్ట్ చేయ‌డం కోస‌మే సత్యవర్ధన్‌తో అతనికి సంబంధం లేకుండా కేసు పెట్టించార‌న్నారు. ఈ ఘటన జ‌రిగిన‌ స్థలంలో వంశీ లేడు కాబట్టి ఆయన పేరు ఎవరూ చెప్పలేద‌న్నారు. సత్యవర్ధన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో త‌న‌ను ఎవ‌రూ తిట్టలేదని చెప్పాడ‌న్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేసు రీ ఓపెన్ చేసి సత్యవర్ధన్‌తో రెండోసారి వాంగ్మూలం తీసుకున్నార‌న్నారు. సీఎం చంద్ర‌బాబు కేవ‌లం వంశీ మీద ఉన్న కోపంతోనే కేసు పెట్టించార‌ని ఆరోపించారు. మ‌రోవైపు వంశీకి బెయిల్ రాకుండా అట్రాసిటీ కేసులు కూడా పెట్టించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *