ఏపీలో డయేరియా బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. విజయనగరం జిల్లాలో ఇప్పటికే డయేరియాతో 11 మంది మృతి చెందారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ నేడు విజయనగరానికి రానున్నారు. డయేరియాతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వారిని వైయస్ జగన్ పరామర్శించనున్నారు. డయేరియాతో మృతి చెందిన వారి కుటుంబాలను కూడా కలవనున్నారు. బాధితుల పరామర్శ అనంతరం జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.