డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. 2026లో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో దక్షిణాదికి అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గిందని వైయస్ జగన్ పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపుపై స్పందించారు.ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ గనుక చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే ఆందోళన నెలకొందని, జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుందని చెప్పారు. ఇది దృష్టిలో పెట్టుకొని జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ లేకుండా చూడాలని కోరారు. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాల్లో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలన్నారు. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలని కోరారు.