చంద్రబాబు పాలనలో బీహార్‌లా మారుతున్న ఏపీ

సీఎం చంద్ర‌బాబు పాల‌న‌లో ఏపీ బీహార్‌లా మారుతుంద‌ని మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ విమ‌ర్శించారు. పాపిరెడ్డిపల్లిలో హ‌త్య‌కు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైయ‌స్ జ‌గ‌న్‌ పరామర్శించి మాట్లాడారు. ఏపీలో పరిస్థితులు గ‌తంలో బీహార్‌ను తలపిస్తున్నాయ జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నాయో ప్రతిఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రతలు దిగజారాయ‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేత‌లు అడుగడుగునా దౌర్జన్యాలకు పాల్పడ్డార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.పిన్నెల్లి రామకృష్ణ, పోసాని కృష్ణమురళిపై కేసులు బనాయించి తీవ్రంగా వేధించార‌న్నారు. నందిగం సురేష్ ను 145 రోజులు జైల్లో ఉంచార‌ని చెప్పారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలేన‌ని, సీఎంకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పద‌ని హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *