ఏపీలో ఉచిత బ‌స్సు హామీపై వైయ‌స్ ష‌ర్మిల ఆగ్ర‌హం

ఏపీలో సీఎం చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం హామీపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయ‌స్ ష‌ర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం ష‌ర్మిల మ‌హిళ‌ల‌తో క‌లిసి విజ‌య‌వాడ నుంచి తెనాలికి ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌యాణికులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… ‘ చంద్రబాబు అధికారంలో వచ్చి నాలుగు నెలలు అయింది. అయినా ఉచిత బస్సు ప్రయాణంపై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణం ఎప్పుడు అని అడుగుతున్నారు. తెలంగాణలో వారంలో అమలు చేశారు. కర్ణాటకలో కూడా అమలు చేస్తున్నారు. కానీ మీకు మాత్రం పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏమిటి ? రాష్ట్రంలో ప్రతి రోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. రోజు మహిళల ద్వారా రూ.7-10 కోట్లు అంటే నెలకు రూ.300 కోట్లు ఆదాయం వస్తుంది. ఉచిత ప్రయాణం కల్పిస్తే…ఈ రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుంది అని భయమా ?. మహిళల చేత ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు మహిళల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయలేరా ? మీ సూపర్ సిక్స్ హామీల్లో 4 పతకాలు మహిళలవే. ఇందులో ఉచిత ప్రయాణం ఒక్కటే తక్కువ ఖర్చు. ఇలాంటి తక్కువ ఖర్చు పథకం కూడా మీకు అమలు చేయడానికి ధైర్యం రావడం లేదా..?ఇదే అమలు చేయనప్పుడు ఇక పెద్ద పథకాల సంగతి ఏంటి? 5 ఏళ్లు ఇలానే కాలయాపన చేస్తారా? ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు భద్రత ఉంటుంది. ఇది చాలా మంచి పథకం. చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఉచిత ప్రయాణం అమలు చేయండి. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వండి. మహిళలకు భరోసా కావాలి. మహిళలకు భద్రత విషయంలో ముందడుగు పడాలి. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలని ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు పంపిస్తున్నాం. రాబోయే రెండు మూడు రోజుల్లో పెద్ద ఎత్తన పోస్ట్ కార్డులు పంపిస్తాం. ఇది చూసైనా వెంటనే చంద్రబాబు గారు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నాంస అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *