ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో మహిళల రక్షణలో అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వదురు కళ్యాణి ఆరోపించారు. రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతిపై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తాట తీస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. నాగాంజలి మృతి చాలా బాధాకరమని, వేధింపులతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. 12 రోజులు మృత్యువుతో పోరాడినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.నాగాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్లో రాసిందని, ఇక దీపక్ పనిచేసే కిమ్స్లోనే 12 రోజులుగా ఉంచితే సరైన వైద్యం ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి నుంచి కనీస స్పందించలేదన్నారు. నాగాంజలి కుటుంబానికి ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం ఆ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారా అని ప్రశ్నించారు. పవన్ మాటలు చేతలకు పని చేయవా? అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని మంత్రి స్టేట్ మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేదని మండిపడ్డారు.